ప్రొద్దుటూలో కల్లాపి రంగు ఫ్యాక్టరీలపై ఆకస్మిక దాడులు.!
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ASP విభుకృష్ణ ఆధ్వర్యంలో పొద్దుటూరులోని నిషేధిత రసాయన కల్లాపి రంగు ఫ్యాక్టరీలపై మంగళవారం సాయంత్రం ఆరు చోట్ల అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిషేధిత రసాయనాలను సీజ్ చేశారు. ఈ రసాయనాల వల్ల మరణాలు సంభవిస్తుండడంతో ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు సీఐలు కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయుడు, నాగభూషణ్, స్థానిక ఎస్సైలు, ఎస్బిఐ సిఐలు భాస్కర రెడ్డి, రెడ్డప్ప, విజిలెన్స్ సీఐ శ్రీనివాసుల రెడ్డి, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ చిన్నారావు, తహసిల్దార్ ఉదయభాస్కర రాజు, ఫైర్ ఆఫీసర్ బసవి రెడ్డి, ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు దాడుల్లో పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి