కల్లాపి రంగు ఫ్యాక్టరీలపై కేసులు: జిల్లా ఎస్పీ విశ్వనాధ్
ప్రొద్దుటూరులోని కల్లాపి రంగు పౌడర్ తయారీ యూనిట్లపై దాడులు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ విశ్వనాథ్ బుధవారం తెలిపారు. ప్రొద్దుటూరు తహశీల్దార్ ఫిర్యాదు మేరకు సౌభాగ్య, కామదేను, మహాలక్ష్మి, చంద్రిక, శ్రీదేవి-భూదేవి ఫ్యాక్టరీలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ పౌడర్ వల్ల జిల్లాలో 19 మంది సూసైడ్ చేసుకొని మరణించారని తెలిపారు. సంబంధిత అన్ని శాఖల అధికారులతో సంయుక్తంగా దాడులు చేసి సీజ్ చేశామాన్నారు.