వరల్డ్ జునోసెస్ డే సందర్భంగా సోమవారం ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీలో పెంపుడు జంతువులకు కాలేజీ అసోసియేట్ డీన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు వేశారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ASP విభుకృష్ణ ఆధ్వర్యంలో పొద్దుటూరులోని నిషేధిత రసాయన కల్లాపి రంగు ఫ్యాక్టరీలపై మంగళవారం సాయంత్రం ఆరు చోట్ల అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిషేధిత రసాయనాలను సీజ్ చేశారు. ఈ రసాయనాల వల్ల మరణాలు సంభవిస్తుండడంతో ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు సీఐలు కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయుడు, నాగభూషణ్, స్థానిక ఎస్సైలు, ఎస్బిఐ సిఐలు భాస్కర రెడ్డి, రెడ్డప్ప, విజిలెన్స్ సీఐ శ్రీనివాసుల రెడ్డి, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ చిన్నారావు, తహసిల్దార్ ఉదయభాస్కర రాజు, ఫైర్ ఆఫీసర్ బసవి రెడ్డి, ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు దాడుల్లో పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లెలో సోమవారం పశు వైద్య కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రారంభించారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జేసీ నిధిమీనా ఆదేశాల మేరకు రూ.38 కోట్ల హౌసింగ్ నిధుల మాయంపై మెప్మా, సచివాలయ అమెనిటీస్ సెక్రటరీలతో జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం విచారణ చేపట్టారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి