ప్రొద్దుటూరు హౌసింగ్ స్కాంపై విచారణ.!
ప్రొద్దుటూరు హౌసింగ్ స్కాంపై మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు. హౌసింగ్ లబ్ధిదారుల నుంచి మెప్మా ఉద్యోగులు, సచివాలయాల ఆమెనిటీస్ సెక్రటరీలు వసూలు చేసిన సుమారు రూ.38 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ విచారణ చేపట్టారు. జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్, ప్రొద్దుటూరు మెప్మా అధికారులు, సచివాలయాల ఆమెనిటీస్ సెక్రటరీలు, హౌసింగ్ ఇంజనీర్లు, డిఆర్డిఎ, యండిఓ అధికారులతో జాయింట్ కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి