"ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు" ట్రాన్స్ జెండర్లకు ఎస్సై రాజు కౌన్సిలింగ్
ప్రొద్దుటూరు: ఇతరులను ఇబ్బంది పెట్టకుండా గౌరవంగా ఉండాలని స్థానిక ట్రాన్స్ జెండర్లకు రూరల్ ఎస్సై రాజు గురువారం కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్లపై అడ్డుగా ఉంటూ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నారు. డబ్బుల కోసం డిమాండ్ చేయడం, ప్రజలను వాహనదారులను దూషణ, దాడులు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసభ్యకర, అభ్యంతరకరమైన చర్యలకు దూరంగా ఉండాలన్నారు. ఇతరుల వల్ల మీకు ఇబ్బందులు కలిగితే చ ట్ట ప్రకారం రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.