పోస్ట్‌లు

🔴 Breaking News

"ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు" ట్రాన్స్ జెండర్లకు ఎస్సై రాజు కౌన్సిలింగ్

చిత్రం
ప్రొద్దుటూరు: ఇతరులను ఇబ్బంది పెట్టకుండా గౌరవంగా ఉండాలని  స్థానిక ట్రాన్స్ జెండర్లకు రూరల్ ఎస్సై రాజు గురువారం కౌన్సిలింగ్ ఇచ్చారు.  రోడ్లపై అడ్డుగా ఉంటూ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నారు.   డబ్బుల కోసం డిమాండ్ చేయడం, ప్రజలను వాహనదారులను దూషణ, దాడులు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అసభ్యకర, అభ్యంతరకరమైన చర్యలకు దూరంగా ఉండాలన్నారు.  ఇతరుల వల్ల మీకు ఇబ్బందులు కలిగితే చ ట్ట ప్రకారం రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

హాస్టళ్లలో మీరు సెప్టీగానే ఉన్నారా.?: SI మహబూబ్ భాషా

చిత్రం
ప్రొద్దుటూరు: హాస్టళ్లలో మహిళలు, బాలికలు సెప్టీగానే ఉన్నారా అని స్థానిక 2టౌన్ ఎస్సై మహబూబ్ భాషా గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులతో మాట్లాడుతూ.. హాస్టళ్లలో నిబంధనల మేరకు అన్ని భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వసతులు కల్పించాలన్నారు.  రిజిస్టర్ నమోదు చేయాలన్నారు.  అమ్మాయిల హాస్టళ్లలోకి పోకిరీలు, జులాయిలు రాకుండా చూడాలన్నారు.   సైబర్ మోసాలు, నేరపూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వేదింపులు, దాడులు, సమస్యలపై నిరావకులు, పేరెంట్స్, పోలీసులకు పి ర్యాదు చేయాలని సూచించారు.

ప్రొద్దుటూరు నుంచి కార్పొరేట్ వ్యాపారులు వెళ్ళిపోవాలి: పార్టీల నేతలు

చిత్రం
ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారాలు, కులవృత్తులు ఉపాధి, ఉద్యోగాలను దెబ్బతీస్తున్న కార్పోరేట్ వ్యాపార సంస్థలు ఇక్కడినుంచి వెళ్లి పోవాలని YCP, CPI, BJP నేతలు కోరారు. YCP రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, CPI రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, BJP పట్టణ అధ్యక్షుడు నరేంద్ర ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

చంద్రబాబు హయాంలోనే ఉపాధ్యాయ నియామకాలు:AMC చైర్మన్ లక్ష్మణ్

చిత్రం
ప్రొద్దుటూరు: రాష్ట్రంలో 14 ఉపాధ్యాయ నియామకాలు (DSCలు) నిర్వహించగా.. అందులో 11 DSCలు CM చంద్రబాబు హయాంలోనే జరిగాయని ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ తెలిపారు.  గురువారం పొద్దుటూరులో STF ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..  ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇర్ఫాన్ భాష, STF నేతలు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

పాత నేరస్తుడు అరెస్ట్.. గంజాయి స్వాధీనం: సిఐ కొండారెడ్డి

చిత్రం
ప్రొద్దుటూరు 1టౌన్ పోలీసులు గురువారం పాత నేరస్తున్ని అరెస్ట్ చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.  స్థానిక 1టౌన్ సీఐ కొండారెడ్డి వివరాల మేరకు.. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన షేక్ జిలాని పొద్దుటూరులో ట్రాక్టర్ డ్రైవర్ గా ఉంటూ గంజాయి విక్రయం చేస్తున్నాడు.  గుంతకల్ నుంచి గంజాయి కొనుగోలు చేసి, ప్రొద్దుటూరులో విక్రయిస్తున్నాడు.  ఇటీవల UPకి చెందిన ఐస్ క్రీం వాలా పింటుకు అమ్మగా, మిగతా  385 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కడప రైల్వే పోలీస్ స్టేషన్, ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో పాత కేసులు ఉన్నాయన్నారు. గతంలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చాడన్నారు. 

హుండీల ఆదాయం రూ.9.37 లక్షలు.!

చిత్రం
పొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం (శివాలయం) హుండీలను గురువారం లెక్కించారు.  గత 15 నెలల కాలంలో భక్తులు సమర్పించిన కానుకలు, నగదును లెక్కించారు.  హుండీల లెక్కింపు ద్వారా రూ.9.37 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణ తెలిపారు. రామేశ్వరం ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం ఈవో  శ్రీధర్, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.  

ప్రొద్దుటూరులో కొత్త వివాదం ప్రారంభం.!

చిత్రం
ప్రొద్దుటూరులో కొత్త వివాదం ప్రారంభమైంది.  పొద్దుటూరు మొదటి నుంచి ప్రముఖ వ్యాపార కేంద్రం.  ఇక్కడ మార్వాడీలు లేరు.  స్థానికులే మొదటి నుంచి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.  ఇటీవల అక్కడికి కార్పోరేట్ కంపెనీలు దిగుమతి అయ్యాయి.  సెలూన్ మొదలుకొని జ్యువెలరీ వ్యాపారాల వరకు విస్తరించాయి.  కిరాణా కొట్టు మొదలుకొని కుదువ వ్యాపారం వరకు వారే ఉన్నారు.  దాంతో స్థానిక వ్యాపారులకు వ్యాపారం తగ్గిపోయింది.  ఇక్కడి సాంప్రదాయ వృత్తిలోని వారికి ఉపాధి పోయింది.  ఈ పరిస్థితుల్లో కొత్త వివాదం ప్రారంభమైంది.  కార్పొరేట్ వ్యాపారులు వెళ్లిపోవాలని, వారి రాకను అడ్డుకుంటామని స్థానిక వ్యాపారులు కొత్త ఉద్యమాన్ని తీసుకువచ్చారు.  వీరికి స్థానిక వైసీపీ, సీపీఐ నేతలు మద్దతు ఇచ్చారు.  భవిష్యత్తులో ఈ వ్యతిరేక ఉద్యమం ఎంతవరకు వెళ్తుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.