విద్యార్థులకు చెకుముకి సైన్స్ పోటీలు.!
ప్రొద్దుటూరులో గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు చెకుముకి సైన్స్ పోటీలను నిర్వించారు. ఈ పోటీలకు 8500 మంది విద్యార్థులు హాజరయ్యారని JVV రాష్ట్ర కమిటీ సభ్యులు సునీత, చెకుముకి పోటీల కన్వీనర్ రవిబాబు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయి విజేతలకు సెప్టెంబర్ 11న తోగటవీర క్షత్రియ కళ్యాణమండపంలో కార్యక్రమం ఉంటుందన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.