విద్యార్థులకు నగదు పంపిణీ.!
ప్రొద్దుటూరు: స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ 10వ తరగతి పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో వచ్చిన విద్యార్థులకు రిటైడ్ టీచర్ ఈశ్వరరెడ్డి నగదు బహుమతి పంపిణీ చేశారు. రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు చొప్పున పంపిణీ చేశారు. శనివారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో HM, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.