విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి: JVV డా. నరసింహారెడ్డి
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 9): విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ఆసక్తి, జిజ్ఞాస పెంపొందించడానికి చెకుముకి పోటీలు నిర్వహిస్తున్నట్లు JVV ప్రొద్దుటూరు వ్యవస్థాపకులు డా. నరసింహారెడ్డి తెలిపారు. చెకుముకి సైన్స్ పోటీల పోస్టర్లను ఆదివారం ప్రొద్దుటూరులో జన విజ్ఞాన వేదిక నాయకులు ఆవిష్కరించారు. ఈనెల 27న పాఠశాల స్థాయిలో, సెప్టెంబరు 11న మండల స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.