ఏసీబీ CALLపై మున్సిపల్ ఉద్యోగుల్లో చర్చ!
ప్రొద్దుటూరు మున్సిపల్ ఉద్యోగులు ఏసీబీ CALLపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఫోన్ కు ఏసీబీ పేరుతో CALL వచ్చింది. ఆయన ఆ CALLను సెక్షన్ హెడ్స్, ఉద్యోగులకు కాన్ఫరెన్స్ CALL కలిపాడు. సదరు ACB అధికారి మున్సిపల్ ఉద్యోగుల అవినీతిపై ప్రశ్నించాడు. వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు, బ్యాలెన్స్ వివరాలు అడిగాడు. ఈ CALLపై అనుమానంతో ఒక అధికారి నేరుగా కడప ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఫేక్ CALL అని ACB అధికారులు తెలిపారు. దీనిపై ప్రొద్దుటూరు మున్సిపల్ ఉద్యోగులు తమను బ్లాక్ మెయిల్ చేస్తూ, తమవారే ఫేక్ CALL చేయించారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫేక్ CALLపై చర్చ జరుగుతోంది.