రాష్ట్రంలో స్వాతంత్ర్యం ఎక్కడ బాబు.?: రాచమల్లు
ప్రొద్దుటూరు: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ప్రజలకు స్వాతంత్ర్యం లేదని, అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లు కొనసాగుతున్నాయని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్య వచ్చి 80 ఏళ్లు అయిందన్నారు. రాష్ట్రంలో ప్రజలు స్వాతంత్ర్యం కోల్పోయి 26 నెలలు అవుతోందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే వారందరినీ తప్పుడు కేసులతో భయపెడుతున్నారన్నారు.