నకిలీ డాక్యుమెంట్ల కేసులో చెన్నంరాజుపల్లె వాసి అరెస్ట్.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 13): ప్రొద్దుటూరు MRO కార్యాలయంలో నకిలీ డి-పారాల కేసులో చెన్నంరాజుపల్లెకు చెందిన మేడం హజరయ్యను గురువారం స్థానిక 3టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రామాంజనేయుడు సమాచారం మేరకు.. MRO కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ మరికొంతమంది కలిసి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి, వాటి ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించారు. వీటిపై MRO పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి గతంలో నరేంద్రను, ఇప్పుడు హజరయ్యను అరెస్ట్ చేశారు.