సాగునీరివ్వాలని మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే.!
ప్రొద్దుటూరు: కడప జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి కోరారు. ఈ మేరకు లింగారెడ్డి శుక్రవారం సెక్రటేరియట్లో మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రాజెక్టు నుంచి కడప జిల్లాలోని కేసీ కెనాల్, తెలుగుగంగ, గండికోట, మైలవరంకు నీటిని విడుదల చేయాలని మంత్రిని కోరినట్లు లింగారెడ్డి తెలిపారు.