అగస్త్యేశ్వరాలయంలో శాశ్వత యాగశాల ఏర్పాటు.!
ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయంలో శాశ్వత యాగశాల ఏర్పాటుకు సోమవారం ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆలయ ముఖ మండపం వద్ద హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందిగా ఉందన్నారు. శాశ్వత యాగశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఆలయంలో స్వామి, అమ్మవార్ల మెరవని నిర్వహించారు. పాలకమండలి సభ్యులు, అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు, భక్తుల పాల్గొన్నారు