తప్పిపోయిన బాలికను తల్లికి అప్పగించిన పోలీసులు.!
ప్రొద్దుటూరు: స్థానిక శ్రీనివాసనగర్ కు చెందిన లక్ష్మి తన కూతురు ప్రశాంతి (9) కనిపించడం లేదని ఆదివారం ప్రొద్దుటూరు 2టౌన్ పోలీసులను ఆశ్రయించడము జరిగింది.
సమాచారం అందిన వెంటనే ASP విభుకృష్ణ ఆదేశాల మేరకు 2టౌన్ CI వంశీనాథ్, SI రాఘవేంద్రా రెడ్డి తమ సిబ్బందితోటి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందిన రెండు గంటలలోపే త్రప్పిపోయిన బాలిక ను గుర్తించి, సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు.