ప్రొద్దుటూరులో దోమలపై ర్యాలీ.!
ప్రొద్దుటూరులో గురువారం ప్రపంచ దోమల దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాసనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం నుండి రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ DMHO డా. గీత మాట్లాడుతూ.. దోమల ద్వారా మలేరియా, పైలీరియా, చికున్ గున్యా, డెంగ్యూ తదితర వ్యాధులు వస్తాయన్నారు. దోమల నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.