కల్లూరులో కరెంట్ షాక్ తగిలి గొర్రెల కాపరి మృతి.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 9): ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గజ్జల ఓబులేసు ఆదివారము గొర్రెలు మేపడానికి వెళ్ళి వేలాడుతున్న కరెంట్ తీగ తగిలి, ఒళ్ళంతా కాలి స్పాట్ లోనే మృతి చెందాడు.
*కల్లూరుకు చెందిన గొర్రెల కాపరులు గజ్జల ఓబులేసు, పుల్లేరపు గంగా జగన్, మర్రిబోయిన లక్ష్మీనారాయణ ఆదివారం గొర్రెలను మేపడానికి పెన్నానది ఏటి పోరంబోకు ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ కరెంట్ స్తంభానికి వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలి ఓబులేసు మృతి చెందాడు. మిగతా ఇద్దరు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.