మీ దీక్షకు ఖర్చెంత కమీషనర్.?
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో స్వచ్ఛ సంకల్ప దీక్ష పేరుతో కమిషనర్ విశ్వనాథ్ ఖర్చెంత పెట్టారో చెప్పాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేత గోసంగి సుబ్బారెడ్డి సోమవారం ప్రశ్నించారు. ఈ మేరకు ఆర్టీఐ దరఖాస్తు చేసినట్లు తెలిపారు.
ఏ ఖాతా నుంచి, ఎవ్వరి అనుమతితో ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. సేకరించిన ప్లాస్టిక్ ఏ విధంగా డిస్పోజ్ చేశారని ప్రశ్నించారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల గుర్తింపు, పరీక్షలు, సేకరణ, చర్యలకు అవసరమైన సిబ్బంది, ల్యాబ్, పరికరాలు మున్సిపాలిటీ వద్ద ఉన్నాయా అని ప్రశ్నించారు.