శివుని సొమ్ము తిన్నోళ్లను శిక్షించాలి.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 13): స్థానిక అగస్త్యేశ్వరాలయం సొమ్ము తిన్నోళ్లను శిక్షించాలని భక్తులు కోరారు. గురువారం శివ భక్తులు ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణను కలిశారు. శివయ్యకు చెందిన వెండి ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.కోటి నిధులు కొట్టేసిన గత అధికారుల నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించాలన్నారు. ఇందుకోసం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.