రైతులకు అందుబాటులో: AMC చైర్మన్ లక్ష్మణ్ కుమార్
ప్రొద్దుటూరు AMC చైర్మన్ గా గురువారం పట్నం లక్ష్మణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. AMC ద్వారా రైతులకు అందించాల్సిన అన్ని సేవలను అందిస్తామన్నారు. రైతులు, వ్యాపారులకు అందుబాటులో ఉంటానని, కమిటీ ఆదాయం పెంపునకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి MLA వరదరాజుల రెడ్డి, మాజీ MLC పుల్లయ్య, మాజీ MPP రాఘవ రెడ్డి, సెక్రటరీ రత్నరాజు, TDP ముఖ్య నేతలు, డైరెక్టర్లు, కమిటీ సిబ్బంది హాజరయ్యారు.