AMC చైర్మన్ లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం నేడే.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 12): ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పట్నం లక్ష్మణ్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, టిడిపి ముఖ్య నేతలు, అధికారులు, హాజరవుతున్నారు. వద్ది సురేఖ అనారోగ్య కారణాలతో AMC చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆమె స్తానంలో వైస్ చైర్మన్ లక్ష్మణ్ కుమార్ చైర్మన్ గా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు.