మార్కెట్ కమిటీల రాబడి రూ.1.71కోట్ల: ADM నరేంద్ర
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 13): గత నెలలో వ్యవసాయ మార్కెట్ కమిటీల రాబడి పెరిగిందని మార్కెటింగ్ శాఖ జిల్లా ఏడి నరేంద్ర తెలిపారు. మార్కెటింగ్ శాఖలో గత నెల నుంచి
e-ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. దీంతో గత నెలలో రూ.1.71 కోట్లు వసూలైందన్నారు. ప్రొద్దుటూరు AMC నుంచి రూ.21.24 లక్షలు వచ్చిందన్నారు. వ్యాపారులు ఆన్లైన్లోనే చలానా కట్టి, పర్మిట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.