ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో బాలునికి విద్యుత్ షాక్.. ICUలో చికిత్స.!
ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో వినాయకుని విగ్రహం మండపం వద్ద ఆదివారం సాయంత్రం సందీప్(16) విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డాడు. స్థానిక గాంధీరోడ్డు లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ICUలో చికిత్స అందిస్తున్నారు. 1టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్సై మధుసూదన్ రెడ్డి ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు. అక్కడే వినాయకుడు విగ్రహాన్ని ప్రశాంతంగా నిమజ్జనానికి తరలించారు.