కడప: వాణిజ్యపరంగా కీలకమైన ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేసీ డా. నిధిమీనా, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరయ్యారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పట్టణంతో పాటు పరిసర గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు పట్టణాన్ని పరిసర గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానించే రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్ర...