శివాలయం భూముల ఆక్రమణలపై చర్యలు: చైర్మన్ నారాయణరెడ్డి
ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయానికి చెందిన స్థలాలు, భూములను సర్వే చేయించినట్లు ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కొత్తపల్లె పంచాయితీ ఆటోనగర్ ప్రాంతంలో 7.31 ఎకరాలను ప్రభుత్వ సర్వేయర్ ద్వారా సర్వే చేయించి స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇందులో కొందరు ఆక్రమణలు చేశారన్నారు.
ఆలయ భూములను బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు.