నేడు ప్రొద్దుటూరులో పవర్ కట్.!
ప్రొద్దుటూరు పట్టణములోని మైదుకూరు రోడ్డులో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ డీఈ మారుతి శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపి వస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.