టౌన్ బ్యాంక్ అవినీతిపై అప్పుడే చెప్పాను: టిడిపి నేత ఉక్కు ప్రవీణ్
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ అవినీతిపై తాను అప్పుడే బయట పెట్టానని టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో SS మాల్ రూములకు టౌన్ బ్యాంకులో నిబంధనలకు విరుద్ధంగా లోన్స్ ఇచ్చారన్నారు. అందుకు ప్రతిఫలంగా అప్పటి చైర్మన్ SS మాల్లో రూములు పొందాడన్నారు. రూ.50 లక్షలు అప్పటి MLA ఎత్తాడన్నారు. టౌన్ బ్యాంక్ ఎత్తిపోతోందని, దివాళా తీస్తుందని తాను అప్పుడే చెప్పానన్నారు. ఆ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తనకు వాటా రాకపోవడంతో ఇప్పుడు చెప్తున్నాడన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.