శివాలయం స్కాంలో బాలాజీని తప్పించి.. గుమస్థాపై వేటు.!
ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం (శివాలయం) స్కాంలో ఆరోపణలున్న అధికారిని ఒదిలేసి గుమస్తా ప్రసాద్ ను గురువారం ఈఓ రమణ సస్పెండ్ చేశారు.
ఆలయ ఈఓగా శంకర బాలాజీ హయంలో రూ.కోటి నగదు, అమ్మవారి బంగారు హారం, స్వామి వారి వెండి కవచం మాయమయ్యాయని ఆలయ చైర్మన్ పిర్యాదు చేశారు. వీటిపై మొదట ఎండోమెంట్ జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పాండురంగారెడ్డి విచారణ జరిపి ఆభరణాలు మాయమయ్యాయని కర్నూల్ DCకి రిపోర్ట్ పంపారు.
తర్వాత 6మంది ఆడిటర్లు తనిఖీలు నిర్వహించి, రూ.68 లక్షలు ఫ్రాడ్ జరిగిందని తిరుపతి RJCకి నివేదిక పంపారు. దీనిపై గత నెలలో తిరుపతి RJC ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ పంపారు. ఎండోమెంట్ కమిషనర్ చర్యలకు ఆదేశించారు. అధికారి శంకర బాలాజీని రక్షించడానికి గుమస్తా ప్రసాద్ పై వేటు వేశారని ప్రచారం జరుగుతోంది.