సమస్యలపై మహాత్మునికి వినతి పత్రం.!
ప్రొద్దుటూరు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు.
మంగళవారం సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు ఆత్మ ఘోష ర్యాలీ చేపట్టారు. తమకు రావాల్సిన AAS, DA, ప్రమోషన్ ఛానల్ కల్పించాలని కోరారు. మున్సిపల్ గాంధీ పార్కులోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. యూనియన్ నాయకులు కిరణ్, పేరయ్య, వెంకటనారాయణ, నాగార్జున, సునీత, కరుణ పాల్గొన్నారు.