"లంచం" వెనక్కు ఇప్పించిన కమీషనర్.!
ప్రొద్దుటూరులో కొత్త పెన్షన్ల దరఖాస్తుల నమోదు కోసం లబ్దిదారుల నుంచి కొంత మంది సచివాలయ ఉద్యోగులు డబ్బులు వసూలు చేశారు. మున్సిపల్ కమిషనర్ కు బాధితులు పిర్యాదు చేశారు. స్థానిక 7వ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ సుదర్శన్ రూ.200లు చొప్పున వసూళ్లు చేశాడని పిర్యాదు చేశారు. కమీషనర్ విచారణ జరిపారు. 10 మంది నుంచి వసూళ్లు చేశాడని గుర్తించారు. వారికి డబ్బులు వెనక్కు ఇప్పించారు.