ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రాచమల్లు
వైసీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, పార్టీ పరిశీలకులు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి గట్టిగా కృషి చేయాలని కోరారు.