ఖాదర్ హుస్సేన్ మసీదు వీధిలో పరిస్థితి చూడండి.. కమీషనర్ సార్.!
ప్రొద్దుటూరులో పేదలు నివసించే ఖాదర్ హుస్సేన్ మసీద్ వీధిలో పరిస్థితి ఇది. కాల్వల్లోని మురుగు నీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది. నడవడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. చిన్న పిల్లలకు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా పేదలు నివసించే ఈ ప్రాంతంలో రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. డ్రైన్స్ రోజువారీ క్లీన్ చేయడం లేదు. అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.