బంగారు పతకాలు సాధించిన ప్రొద్దుటూరు పోలీసులు.!
గుంటూరు VIT యూనివర్సిటీలో ఈనెల 1నుండి 4వతేదీ వరకు 1st ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ స్టేట్మీట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటి రోజున ప్రొద్దుటూరు పోలీసులు 3 బంగారు పతకాలు గెలుచుకున్నారు. తైక్వాండో under 68kgల విభాగంలో ప్రొద్దుటూరు 2టౌన్ ఎస్సై మహబూబ్ భాష, అండర్ 80 kgల విభాగంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ S.P.M Basha, మహిళల ఓవర్ 67 kgల విభాగంలో 3టౌన్ మహిళా కానిస్టేబుల్ పి.శివ కుమారి బంగారు పతకాలుసాధించారు. వీరిని ప్రొద్దుటూరు పోలీస్ అధికారులు అభినందించారు.