చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్.. బంగారు స్వాధీనం:ASP విభూకృష్ణ
ప్రొద్దుటూరు పాత బస్టాండులో ఈనెల 12న ఎర్రగుంట్ల మండలం చిలమకూరుకు చెందిన సారెడ్డి లక్ష్మీదేవి బస్సు ఎక్కుతుండగా ఆమె హ్యాండ్ బ్యాగును దుండగులు దొంగలించారు. అందులో 5 తులాల 4 బంగారు గాజులు ఉన్నాయని బాధితురాలు స్థానిక 3టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ కేసులో 3టౌన్ సీఐ రామాంజనేయుడు, ఎస్ఐ సంజీవరెడ్డి శుక్రవారం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గోపన్నపల్లెకు చెందిన షబీనా, ముబీనా, షాహిద్ ఖాన్ లు అరెస్ట్ చేశారు. వారినుంచి బంగారు స్వాదీనం చేసుకున్నారు. డిమాండుకు తరలించారని ASP విభూకృష్ణ మీడియాకు తెలిపారు.