చౌడూరు రైతులకు పాసుపుస్తకాలు: ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు: స్థానిక చౌడూరు గ్రామంలో బుధవారం 876 మంది రైతులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రాజముద్రతో, క్యూఆర్ కోడ్ కలిగిన, 14 భద్రతా ప్రమాణాలతో పాసుపుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూముల రీ సర్వే పూర్తిచేసి, చౌడూరులో 923 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసిందన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ కుమార్, మాజీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, డీటీ సుదర్శన్, ఆర్ఐ నాగమోహన్ రెడ్డి, సర్వేయర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.