జిల్లాలో 7, 018 మొబైల్ ఫోన్లు రికవరీ: ఎస్పీ విశ్వనాధ్
కడప పోలీసులు "ఆపరేషన్ మొబీ ట్రాక్”లో 10 దశల్లో ఇప్పటివరకు రూ.13.73 కోట్ల విలువైన 7,018 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.
2026 జూలై 8 నుండి సెప్టెంబర్ 4 వరకు కేవలం 60 రోజుల వ్యవధిలో 531 పోయిన/దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు విజయవంతంగా గుర్తించి రికవరీ చేశారన్నారు. వాటి విలువ రూ.1,06,40,000/- ఉంటుందన్నారు. రికవరీ చేసిన పోన్లను శనివారం వాటిని పోగొట్టుకున్న వారికి అందజేశారు.