ప్రొద్దుటూరులో ఇక 52 మంది కౌన్సిలర్లు.!
ప్రొద్దుటూరులో మున్సిపల్ కౌన్సిలర్ల సంఖ్య 41 నుంచి 52కు పెరగనుంది. వార్డుల డీ-లిమిటేషన్ ప్రక్రియకు అవాంతరాలు తొలగిపోయాయి. దీంతో ప్రొద్దుటూరులో 41 నుంచి 52కు ఎలక్షన్ వార్డులు పెరగనున్నాయి. 2026 జనవరి ఓటర్ల జాబితా ప్రకారం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పురుష ఓటర్లు 66,199, మహిళా ఓటర్లు 70,974, ఇతరులు 29 మంది ఉన్నారు. గతంలో131 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటి సంఖ్య ఇపుడు 152కు పెరగనుంది. ఈ మేరకు అధికారులు నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.