పేకాట స్థావరంపై పొద్దుటూరు 1టౌన్ పోలీసుల దాడులు.
పొద్దుటూరు 1టౌన్ SI మధుసూదన్ రెడ్డి తన సిబ్బందితో
శుక్రవారం సాయంత్రం పేకాటపై దాడి చేశారు.
రామేశ్వరం సాయిబాబా గుడి వెనకవైపు ఉన్న ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
వీరు లోపల బయట అను జూదము ఆడుతుండగా రాబడిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసి పట్టుకోవడం జరిగిందని సీఐ కొండారెడ్డి తెలిపారు. పట్టుబడిన వారిలో 1. కుమారగారి రమేష్, 2. షేక్ మజీద్ భాష , 3. మోపురి రవీంద్రారెడ్డి, 4.సాలంకు ఉపేంద్ర, 5.సుంకేసుల గురు ప్రతాప్, 6.దూదేకుల మదార్ వల్లి ఉన్నారన్నారు. వీరి నుండి రూ.22,870లు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ కొండారెడ్డి తెలిపారు.