ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో RBI తనిఖీలు.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో RBI అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.  విజయవాడ RBI కార్యాలయం నుంచి వచ్చిన ఇద్దరు ఆడిటింగ్ అధికారులు సోమవారం నుంచి మూడు రోజులుగా రికార్డులను పరిశీలిస్తున్నారు.  మరో రెండు రోజులపాటు ఈ తనిఖీలు జరగనున్నట్లు తెలిసింది.  బ్యాంకుపై ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే DLCO సత్యానంద్ ఆధ్వర్యంలో సహకార శాఖ అధికారులు బ్యాంకు రికార్డులను తనిఖీలు చేశారు.  కొన్ని సూచనలు చేశారు.  వెంటనే ఇప్పుడు RBI అధికారులు కూడా రికార్డుల పరిశీలన చేపట్టారు.  ఈ పరిస్థితుల్లో బ్యాంకులో ఏమి జరుగుతుందోనని ఖాతాదారులు ఆరా తీస్తున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!