ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో RBI తనిఖీలు.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో RBI అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ RBI కార్యాలయం నుంచి వచ్చిన ఇద్దరు ఆడిటింగ్ అధికారులు సోమవారం నుంచి మూడు రోజులుగా రికార్డులను పరిశీలిస్తున్నారు. మరో రెండు రోజులపాటు ఈ తనిఖీలు జరగనున్నట్లు తెలిసింది. బ్యాంకుపై ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే DLCO సత్యానంద్ ఆధ్వర్యంలో సహకార శాఖ అధికారులు బ్యాంకు రికార్డులను తనిఖీలు చేశారు. కొన్ని సూచనలు చేశారు. వెంటనే ఇప్పుడు RBI అధికారులు కూడా రికార్డుల పరిశీలన చేపట్టారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులో ఏమి జరుగుతుందోనని ఖాతాదారులు ఆరా తీస్తున్నారు.