డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి.. ప్రమాదాలు తెచ్చుకోవద్దు: ఎస్సై రాజు
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 2): డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు తాగి వాహనాలు నడిపే వారిని హెచ్చరించారు. ఆయన సిబ్బందితో కలిసి ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేశారు. కౌన్సిలింగ్ ఇచ్చారు.