గుడి భూముల కబ్జాపై ఎమ్మార్వోకు ఫిర్యాదు.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 1): స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి గుడికి చెందిన 50 సెంట్ల భూమిని ఆక్రమించారని, సర్వే చేసి చర్యలు తీసుకోవాలని, శనివారం స్థానిక ఎమ్మార్వో ఉదయభాస్కర రాజుకు శివాలయం చైర్మన్ నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. సుభద్రమ్మ అనే మహిళ గుడికి భూమిని దానంగా ఇచ్చారన్నారు. ఆ భూమిని ఇతరులు ఆక్రమించారన్నారు. సర్వే చేసి భూమిని తిరిగి గుడికి అప్పగించాలన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.