నకిలీ పోలీసుల వద్ద ఐఫోన్.!
పోలీస్ లాఠీతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నకిలీ పోలీసులను రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు రూరల్ ఎస్సై రాజు అరెస్ట్ చేశారు. శంకరాపురంకు చెందిన సాయినాథరెడ్డి, చౌడూరుకు చెందిన రవిని అరెస్ట్ చేసి, పోలీస్ లాఠీ, రూ.1000లు నగదు శనివారం స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు రూ.లక్ష విలువైన ఐఫోన్ చోరీ చేసినట్లు గుర్తించారు. సోమవారం స్వాధీనం చేసుకున్నారు.