ప్రభుత్వ హాస్టల్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే వరద.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 2): స్థానిక యానాది కాలనీలోని ప్రభుత్వ బాలుర హాస్టల్లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదివారం తనిఖీ చేశారు. హాస్టల్ రికార్డులను, వసతులను పరిశీలించారు. విద్యార్థులను, సిబ్బందిని అక్కడి పరిస్థితులపై విచారించారు. విద్యార్థు లను జాగ్రత్తగా చూసుకోవాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, బాగా చదివించాలని సూచించారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటానని హాస్టల్ వార్డెన్ ను హెచ్చరించారు.