చెన్నంరాజుపల్లెలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 1): ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లె ప్రభుత్వ పాఠశాలలో శనివారం స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించాలని ఆయన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, ఎంఈఓలు సావిత్రి, శోభారాణి పాల్గొన్నారు.