మున్సిపల్ మార్కెట్ ప్రక్షాళన చేపట్టాలి.!
ప్రొద్దుటూరు(జూలై, 4): స్థానిక మున్సిపల్ కూరగాయల మార్కెట్ ప్రక్షాళన చేపట్టాలని బీజేపీ నేత ప్రదీప్ రెడ్డి అధికారులను డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మార్కెట్లో పార్కింగ్, బాత్ రూములు, నిఘా కెమరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆక్రమణలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ముసిపాలిటీ ద్వారా వసూళ్లు చేసినప్పుడు ఉద్యోగులు దోపిడీ చేశారన్నారు. వీటన్నిటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.