శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!
పొద్దుటూరు(జూలై, 22): స్థానిక శ్రీనివాసనగర్ వివాదాస్పద విద్యుత్ సబ్ స్టేషన్ స్థలాన్ని బుధవారం విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. స్థల వివాదంపై ఆరా తీశారు. 80% పూర్తయిన సబ్ స్టేషన్ నిర్మాణం పనులను అధికారులు ఆపారు. మిగతా 20% పనులు పూర్తి చేసి సబ్ స్టేషన్ ప్రారంభించాలంటూ స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఈనెల 25న ధర్నాకు పిలుపునిచ్చారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.