తక్కువ ధరకే సన్న బియ్యం.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 3): స్థానిక మార్కెట్ యార్డులో రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం సేల్స్ కౌంటర్ సోమవారం MLA వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. KG ముడి బియ్యం రూ.50, స్టీం బియ్యం రూ.52లకు BPL కార్డుదారులకు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ముక్తియార్, మాజీ MPP రాఘవ రెడ్డి, AMC వైస్ చైర్మన్ లక్ష్మణ్, సెక్రటరీ రత్నరాజు, MRO ఉదయభాస్కర్, DT అలీఖాన్, FI మహేంద్ర, రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు.