సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 1): స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శనివారం ప్రొద్దుటూరు క్యాంప్ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ రాగి విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మల్లాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ADA అనిత, MAO వరాహరి కుమార్ పాల్గొన్నారు.