ఆర్ఐ రూ.20 లక్షలు ఎత్తాడు: మాజీ వైస్ చైర్మన్ బంగారెడ్డి
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 3): కోర్టు పరిధిలో, జిల్లా
కలెక్టర్ పర్యవేక్షణలో ఉన్న ఆస్తికి ప్రొద్దుటూరు మున్సిపల్ ఆర్ఐ రమేష్ పేరు మార్చి రూ.20 లక్షలు ఎత్తాడని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బంగారెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పూజ ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ రాజారెడ్డి హత్యకు గురయ్యాడన్నారు.
స్థానిక కొవ్వూరు గ్యారేజీలోని ఆయన ఆస్తిపై కోర్టులో కేసు నడుస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఆస్తి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక మున్సిపల్ ఆర్ఐ రమేష్ ఆస్తిపై యజమాన్య హక్కులను ఇతరుల పేరుపై మార్పిడి చేశాడన్నారు. ఇందులో పెద్దల ప్రమేయం ఉందన్నారు.
🔴@proddaturnews1 యూట్యూబ్ ఛానల్ వీక్షించండి.