ఇండ్ల స్థలాల కోసం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా.!
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీ మేరకు ప్రతి ఒక్కరికి 3 సెంట్లు చొప్పున ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వాలని, ప్రభుత్వమే పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని స్థానిక ఎమ్మార్వో ఉదయభాస్కర రాజుకు వినతి పత్రం సమర్పించారు. CPM సత్యం, AIAWU నేతలు డేవిడ్, శేఖర్, ఐద్వా ముంతాజ్, CITU విజయ్ పాల్గొన్నారు.