మున్సిపల్ పెట్రోల్ బంకులో నో స్టాక్.. కమిషనర్ ఆగ్రహం.!
ప్రొద్దుటూరు(జూలై, 30): పొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకులో మూడు రోజులుగా ఆయిల్ సప్లై నిలిచిపోయింది. గురువారం మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పెట్రోల్ బంక్ తనిఖీ చేశారు. బంకులో ఆయిల్ సప్లై లేకపోవడంపై ఆయన సిబ్బందికి మెమోలు జారీ చేశారు. రికార్డులు తనిఖీ చేశారు. రోజువారి నివేదిక తనకు పంపాలని ఆదేశించారు.
- ప్రొద్దుటూరు(జూలై,30): ప్రొద్దుటూరులో పేకాట విచ్చలవిడిగా సాగుతోందని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో జార్జి క్లబ్ మూయించామన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక మళ్లీ తెరిపించారన్నారు. అక్కడ పేకాట ఆడడానికి రూ.1.20 లక్షల సభ్యత్వం వసూలు చేస్తున్నారన్నారు. ఇది ఇంజనీరింగ్ ఫీజు కన్నా ఎక్కువన్నారు. పేకాట క్లబ్బులు నడిపేవారు, క్రికెట్ బుకీలు, రేషన్ బియ్యం స్మగ్లర్లు, రైతుల శనగల డబ్బులు దోపిడీ దారులు అంతా ఎమ్మెల్యే అనుచరులేనని రాచమల్లు ఆరోపించార
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.